VijayaKumar

Apr 19 2024, 19:26

విద్యార్థుల మృతిపై న్యాయం జరిపించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ కి వినతి పత్రం అందజేసిన పల్ల గొర్ల మోదీ రాందేవ్


 భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకులా హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై విచారణ జరిపించాలని SC ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ ను సెక్రటేరియట్లో కలిసి వినతిపత్రం ఇచ్చిన SC,ST,BC హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన ప్రశాంత్ అలాగే రెండు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య, వైష్ణవి, 1 ఇయర్ క్రితం చనిపోయిన మనోహర్ ఇలా యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాల వ్యవధిలో 9 మంది విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా sc సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విద్యార్థుల ప్రాణాలంటే ఈ అధికారులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది జరిగిన ఘటనలకు బాధ్యులైన అందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయాలని విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని జిల్లా మరియూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో tssA అధ్యక్షులు కూరెళ్ళ మహేష్, MRPS నాయకులు చిట్టిపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 18 2024, 22:32

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని కంచనపల్లికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. భాస్కర్ రెడ్డి వలిగొండకు టీఆరెస్ జండా తెచ్చిన మొదటి వ్యక్తి , ఆయన  2001 నుండి టీఆరెస్ లో కొనసాగుతూ తెలంగాణ ఉస్యమంలో చురుకైన పాత్ర పోషించారు.మండలంలోని బునాదిగాని కాలువ మంజూరు కోసం అహర్నిశలు కష్ట పడి పాద యాత్ర చేశారు. భాస్కర్ రెడ్డి టీఆరెస్ లో మండల అధ్యక్షుడిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు గా, రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదవులు నిర్వహిస్తూ కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేశారు. కేసీఆర్ ఉద్యమ కారులను పక్కకు పెడుతూ కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని నిరసనగా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరినట్లు ఆయన తెలిపారు.

VijayaKumar

Apr 18 2024, 17:57

మృతి చెందిన గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి ఆర్ వెంకట్ రెడ్డి యం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్


 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురై 6వ తరగతి చదువుచున్న విద్యార్ధి సీహెచ్ ప్రశాంత్(12) గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయని,    ఎం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామంలో ప్రశాంత్ తల్లిదండ్రులను, తాత, నానమ్మ, అమ్మమ్మ, మేనమామలను కలిసి ఓదార్చి, వారికి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న రాత్రి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురయ్యారని, ఐతే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భువనగిరి గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన తెలంగాణా రాష్ట్రం లో మొదటిదీ కాదు చివరిదీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ 

రాష్ట్రం లో సుమారు 982 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాలల్లో దాదాపు 5,58,923 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన తెలిపారు. కొన్ని గురుకులాల దుస్థితి, విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయమైన స్థితిలో ఉన్నాయని , అట్టహాసంగా గురుకులాలు ఏర్పాటు చేయడం, ఉన్న వాటిని జూనియర్ కాలేజీలుగా అఫ్ గ్రేడ్ చేయడం చేసారు కానీ ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియను, మౌలిక వసతుల కల్పన ను గాలికి వదిలి వేసారని ఆయన ఆరోపించారు.

అత్యధిక శాతం గురుకులాలు ప్రైవేటు భవనాలలో కొన్ని జిల్లాల్లో రెండు మూడు గురుకులాలు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారని , వసతుల విషయంలో కానీ భోజన విషయంలో కానీ నిర్ణయించిన ప్రమాణాలు పాటించకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వారు కొందరైతే, కొంత మంది ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని ఆయన అన్నారు . విద్యార్థుల భోజన నాణ్యతా మీద కానీ, నాణ్యమైన విద్య అందించడంలో కానీ, తల్లిదండ్రులు బయటి వారికి ఎవ్వరికీ కూడా ఫిర్యాదు చేయవద్దని చేసిన వారికి టిసి లు ఇచ్చి పంపి వేస్తామని గురుకుల పాఠశాలల సిబ్బంది చే బెదరింపులు, అంతే కాకుండా ఈ విషయాలు అడిగిన పిల్లలను శారీకంగా హింసకు గురి చేసిన సంఘటనలు కూడా నిత్యం జరుగుతున్నాయని ఆయన అన్నారు. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలి వేసారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 76% గురుకులాలు అర కొర వసతులతో అద్దె భవనాలలో నడుస్తున్నాయని ( బి. సి 119 కి 103, మైనారిటీ 204 కు 190 ,SC: 238 కు 136 అద్దె భవనాలలో). కే జీ బి వి లల్లో ఉన్న 1,00,536 ఆడ పిల్లలు మౌలిక సదుపాయాలు లేక చాల ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. రోజుకు మూడు పూటలు భోజనానికి కలిపి మొత్తం 30 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 

నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించేందుకు బడ్జెట్ ను పెంచాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు వేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో అనుసరించాల్సిన ప్రమాణాలపై నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించాలని, అవి ఖచ్చితంగా అమలు అయ్యేలా తగిన పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని , ప్రత్యేక కమిషన్ ను వేసి గురుకుల పాఠశాలల తీరును పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, సామాజిక ఉద్యమ నాయకురాలు బుద్ధుల సునీత లు ఉన్నారు.

VijayaKumar

Apr 18 2024, 17:51

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: కుంభం కీర్తి రెడ్డి


కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వాటిని బూతులు బూత్ కమిటీలు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో మహిళలను ప్రజలను చైతన్యపరిచి భువనగిరి నియోజకవర్గం నుండి గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు గత అసెంబ్లీ ఎన్నికలలో కార్యకర్తలు కష్టపడి అహర్నిశలు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు అదే ఉద్దేశంతో భువనగిరి ఎంపీ కి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులను శ్రీమతి కుంభం కీర్తి రెడ్డి గారు కోరారు ఈ కార్యక్రమంలో సుక్క స్వామి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎగ్ సర్పంచ్ మరియు పులిగిల్ల బాలయ్య ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గొల్లపెల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 18 2024, 17:35

ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్


      జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమును పోరాడి సాధించిన సిపిఎం ను, చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్న మోడీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి యుండి. జహంగీర్ గారిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్ నర్సింహ్మ పిలుపునిచ్చానారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని పెంచికల్ పహాడ్, అనాజిపురం గ్రామాలలో సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి యండి.జహంగీరి గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పెంచికల్ పహాడ్ గ్రామంలో పని చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు.అనాడు వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరాడి సాధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధికి ఉపయోగపడుతూ రెండు పూటల తిండి తినడానికి ఉపయోగపడుతుందని, గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలు గౌరవంగా జీవించడానికి ఉపాధి హామీ పనులు తోడ్పడుతున్నాయని అన్నారు. కానీ నేడు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్ర కోణం నుండి ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కార్మికుల పైన అనేక భారాలు మోపుతూ చట్టంలో ఉన్న సౌకర్యాలు అన్నింటినీ ఎత్తివేస్తున్నదని మొత్తమే చట్టం లేకుండా చేయాలనే ఆలోచనలో బిజెపి ఉన్నదని ఈఎన్నికల్లో బిజెపి నీ ఓడించకపోతే ఉపాధి చట్టం ఉండదని పేదలందరూ ఐక్యంగా బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మరోపక్క నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల పైన భారాలను మోపుతున్నదని కార్మిక చట్టాలను కాలరాస్తూ పనివారాన్ని పెంచుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపితో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యాయి అని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ప్రజా ఉద్యమాల సారధి సిపిఎం సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగిర్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్ , కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఎదునూరి వెంకటేశం, నాయకులు బిక్షపతి బాలయ్య, స్వామి, బాలరాజు, శ్రీకాంత్, వెంకటేశు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

       

VijayaKumar

Apr 18 2024, 17:19

భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తోనే సాధ్యం: పడమటి జగన్మోహన్ రెడ్డి


వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కొరకై ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని వారిని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు సీఎన్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ రాచకొండ కృష్ణ గారు, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ గారు, మండల ఉపాధ్యక్షులు సంతోష్ గారు, భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ గారు, టేకుల సోమరం గ్రామ బూత్ అధ్యక్షులు పాటి వెంకట్ రెడ్డి , నవీన్ రెడ్డి, రామకృష్ణ , అంబరీష్ , భాను ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

VijayaKumar

Apr 18 2024, 16:07

గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలి ఏఐఎస్ఎఫ్


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్ ను గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది 

ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సంక్షేమ హాస్టల్లో గురుకులాలు సందర్శించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

ఈనెల 14వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి చిత్రపటానికి సంఘ నాయకులు విద్యార్థులు కలిసి శ్రద్ధాంజలి ఘటించారు 

విద్యార్థి మృతికి కారణమైన సాంఘిక సంక్షేమ గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ రజిని గారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేశారు ఇక మీదట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరారు 

సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు 

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది 

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు మచ్చ వినయ్, రామ్ పాక చందు, శివ, సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 18 2024, 13:21

తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత


తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.అరూరు గ్రామంలో అప్పారెడ్డిపల్లి కాలనీలో ముప్పుడి రాములు భార్య బాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు తుమ్మల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ ఓబిసి అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య మత్స్యగిరిగుట్ట మాజీ ధర్మకర్త కసరబోయిన లింగయ్య యాదవ్ మాజీ వార్డు సభ్యులు సత్యనారాయణ యాదవ్ మాజీ హై స్కూల్ చైర్మన్ జినుకల మల్లేష్ యాదవ్ ప్రైమర్ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య యాదవ్ యూత్ నాయకులు ఎలిమినేట్ సంతోష్ చుక్క రామచంద్రు పిన్నిటి లింగారెడ్డి జినుకల బాల నరసింహ జున్ను కల మహేష్ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 18 2024, 00:01

భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం, మీడియా సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ హనుమంతు కే జెండగే


యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే (యాదాద్రి జిల్లా కలెక్టర్ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల అధికారి) పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

 18 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,

 ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా భువనగిరిలో ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లోఏర్పాటు చేశామని అన్నారు.

పార్లమెంట్ పరిధిలో 2141 పోలింగ్ కేంద్రాలు. 

1804930 మంది ఓటర్లు 896,2 19 మంది పురుషులు 908632 మంది స్త్రీలు ఇతరులు 79 మంది.

245 మంది సెక్టర్ ఆఫీసర్స్ 126 వివిధ రకమైన విజిలెన్స్ టీమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

రెండు వెబ్ రెబెల్ పోలింగ్ కేంద్రాలు. 

సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు 637. 

అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసు నందు అభ్యర్థుల హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని అన్నారు.

పొలిటికల్ పార్టీ సువిధ క్యాండిడేట్ యాప్ సువిధ పర్మిషన్ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవచ్చును.

 ప్రజలు సివిజన్ ,ఓటర్ హెల్ప్ ఆప్ ,సాక్ష్యం, కేవైసీ యాప్ ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు.

VijayaKumar

Apr 17 2024, 23:51

తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు


తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజి యం సిఫార్సు చేసింది.

ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తు లుగా జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నా రని నిర్ణయించినట్టు వెల్లడించింది.

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయ మూర్తుల తీర్పులు పరిశీ లించాలని ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు కమిటీని సీజేఐ ఆదే శించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరిం చింది.